ఎయిర్ అంబులెన్సుల్లో హైదరాబాద్కు.. నెల రోజుల్లో 100 మంది కరోనా రోగులు
ABN , First Publish Date - 2021-05-07T10:07:18+05:30 IST
దేశంలో కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఆస్పత్రుల బెడ్ల కొరతతో చికిత్స కోసం పలు రాష్ట్రాల నుంచి ఎయిర్ అంబులెన్సుల ద్వారా
హైదరాబాద్, మే 6: దేశంలో కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఆస్పత్రుల బెడ్ల కొరతతో చికిత్స కోసం పలు రాష్ట్రాల నుంచి ఎయిర్ అంబులెన్సుల ద్వారా హైదరాబాద్కు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఏప్రిల్ 1 నుంచి మే 5 మధ్య దాదాపు 100 మంది కరోనా రోగులు విషమ పరిస్థితుల్లో అత్యవసర చికిత్స కోసం వారాణసీ, ముంబై, అహ్మదాబాద్, పట్నా, రాయ్పూర్, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి వచ్చారని అధికారులు చెప్పారు. ప్రస్తుతం కరోనా చికిత్సకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని ఎయిర్ రెస్క్యూయర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. దేశంలోని ఇతర నగరాలన్నింటి కన్నా హైదరాబాద్కే ‘మెడికల్ ఫ్లైట్స్’ అధికంగా వస్తున్నాయి. ఈ నెలలోనూ బుకింగ్లు ప్రతి రోజు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎయిర్ అంబులెన్సులకు డిమాండ్ బాగా ఉంది.