చిన్నారి తమ్ముడిని ఎత్తుకొని చదువుకోసం స్కూలుకు వెళ్లిన పదేళ్ల బాలిక.. ఆ పేద బాలిక కష్టాన్ని చూసి నెటిజెన్లు ఏమంటున్నారంటే..

ABN , First Publish Date - 2022-04-05T09:54:55+05:30 IST

సోషల్ మీడియాలో ఇటీవల మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి ఒక పదేళ్ల బాలిక ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటో ఇప్పుడు తెగవైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఉన్న బాలికను చూసి కొందరు నెటిజెన్ల మానవతా దృక్పథంతో ఆమె పట్ల జాలి చూపిస్తున్నారు..

చిన్నారి తమ్ముడిని ఎత్తుకొని చదువుకోసం స్కూలుకు వెళ్లిన పదేళ్ల బాలిక.. ఆ పేద బాలిక కష్టాన్ని చూసి నెటిజెన్లు ఏమంటున్నారంటే..

సోషల్ మీడియాలో ఇటీవల మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి ఒక పదేళ్ల బాలిక ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటో ఇప్పుడు తెగవైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఉన్న బాలికను చూసి కొందరు నెటిజెన్ల మానవతా దృక్పథంతో ఆమె పట్ల జాలి చూపిస్తున్నారు. మరికొందరు ఆమె చిన్నవయసులోనే చూపే ధైర్యానికి, పట్టుదలని చూసి మెచ్చుకుంటున్నారు. 


ఆ ఫొటోలో ఉన్న బాలిక పేరు మేనింగ్‌సినిలు. ఆమె ఒక పేద కుటుంబంలో పుట్టిన పదేళ్ల బాలిక. ఆ చిన్న వయసులో మేనింగ్‌సినిలు కుటుంబ బాధ్యతలను కూడా మోస్తూ చదువు కోసం పట్టుదలతో స్కూలుకు వెళుతోంది. పేదరికం కారణంగా ఆమె తల్లిదండ్రులిద్దూ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. ఇంటి వద్ద ఈ బాలిక తన రెండేళ్ల తమ్ముడిని చూసుకుంటూ.. చదువు కొనసాగిస్తోంది. అలాగే పాఠశాల సమయానికి తన చిన్నారి తమ్ముడిని ఎత్తుకొని వెళుతుంది.


పాఠశాలలో తరగతి గదిలో టీచర్లు పాఠాలు చెబుతుంటే తన చిన్నారి తమ్ముడిని తన ఒడిలోనే పడుకోబెట్టి మేనింగ్‌సినిలు పాఠాలు వింటోంది. ఆ పాఠాలు వింటున్న సమయంలో తీసిన ఫొటోను ఆ రాష్ట్ర అటవి శాఖ మంత్రి బిస్వజిత్ థొంగమ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

Updated Date - 2022-04-05T09:54:55+05:30 IST