వరద బాధితుల ఖాతాల్లో రూ.10 వేలు జమ

ABN , First Publish Date - 2022-08-06T09:09:52+05:30 IST

గోదావరి నదిలో ఇటీవల ఇచ్చిన వరదల వల్ల భద్రాద్రి జిల్లాలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం విపత్తు సాయం విడుదల చేసింది.

వరద బాధితుల ఖాతాల్లో రూ.10 వేలు జమ

  • భద్రాద్రి జిల్లాలో 15,614 కుటుంబాలకు సాయం
  • దుమ్ముగూడెం మండలంలో 430 మందికి పెండింగ్‌

భద్రాచలం, ఆగస్టు 5: గోదావరి నదిలో ఇటీవల ఇచ్చిన వరదల వల్ల భద్రాద్రి జిల్లాలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం విపత్తు సాయం విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. భద్రాద్రి జిల్లాలో మొత్తం 16,044 బాధిత కుటుంబాలు ఉండగా వీరిలో 15,614 మందికి సాయం అందింది. సాంకేతిక కారణాలతో దుమ్ముగూడెం మండలంలో 430మంది బాధితులకు సాయం అందలేదు. ఈ మండల జాబితాలో మొత్తం 1936 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 430 మందికి సంబంధించిన వివరాల నమోదులో జరిగిన పొరపాట్లు వల్లే వారి ఖాతాల్లో డబ్బు జమ కాలేదని సమాచారం.

Updated Date - 2022-08-06T09:09:52+05:30 IST