ఏపీలో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-04-04T23:56:25+05:30 IST
రాష్ట్రాన్ని కరోనా ముట్టడిస్తోంది. వైరస్ బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కరోనా బాధితులు పెరిపోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం సాయంత్రానికి
అమరావతి: రాష్ట్రాన్ని కరోనా ముట్టడిస్తోంది. వైరస్ బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కరోనా బాధితులు పెరిపోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం సాయంత్రానికి ఏపీలో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పది కేసులతో ప్రస్తుతానికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరింది. కృష్ణా జిల్లాలో ఐదు, గుంటూరు జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు తేలాయి. ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైంది. ఏపీలో శుక్రవారం కూడా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.