నేపాల్లో 54కు చేరిన మృతుల సంఖ్య..!
ABN , First Publish Date - 2020-07-13T13:48:19+05:30 IST
నేపాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడి ఆదివారం మరో 10మంది మృత్యువాత పడ్డారు. దీంతో మూడు రోజుల్లో మృతి చెందిన వా
కఠ్మాండూ, జూలై 12: నేపాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడి ఆదివారం మరో 10మంది మృత్యువాత పడ్డారు. దీంతో మూడు రోజుల్లో మృతి చెందిన వారి సంఖ్య 54కు చేరింది. 39 మంది గల్లంతు కాగా.. 40 మంది వరకూ గాయపడ్డారు. 19 జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయని, వరదలు ముంచెత్తుతున్నాయని, సహాయ చర్యలకు పోలీసులు, సైన్యాన్ని రంగంలోకి దించామని ప్రభుత్వం పేర్కొంది.