స్వచ్ఛతకు పది నిమిషాలు..

ABN , First Publish Date - 2020-07-13T14:33:15+05:30 IST

స్వచ్ఛతకు పది నిమిషాలు కేటాయిం చాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కోరారు

స్వచ్ఛతకు పది నిమిషాలు..

ఆదివారం 10గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు



ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ / మేడ్చల్‌ : స్వచ్ఛతకు పది నిమిషాలు కేటాయిం చాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కోరారు. ‘ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మంత్రి తన ఇంటి పరసర ప్రాంతాలను శుభ్రం చేశారు. సబితారెడ్డి మనుమడు ఇంద్రతో కలిసి కుండీలను శుభ్రం చేశారు. మల్లారెడ్డి తన ఇంటి పరిసరాల్లో వృథాగా ఉన్న నిలిచిన నీటిని తొల గించి.. మొక్కల కొమ్మలను కత్తిరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్న సందర్భంగా ఇంటి ఆవరణంలో నీటి నిల్వ ఉండే డ్రమ్ములు, కూలర్లలో వారా నికోసారి పూర్తిగా నీళ్లు తీసేసి శుభ్రం చేసుకొని వాడుకోవాల న్నారు. మలేరియా, చికున్‌ గున్యా, ఫైలేరియా, మెదడు వాపు తదితర సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

Updated Date - 2020-07-13T14:33:15+05:30 IST