మరో పది కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-11-24T06:14:13+05:30 IST
జిల్లాలో కొత్తగా 10 మందికి కరోనా వైరస్ సోకింది. సోమవారం ఉదయం వరకు 6,442 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్గా తేలింది.
- ఒకరి మృతి
కర్నూలు(హాస్పిటల్), నవంబరు 23: జిల్లాలో కొత్తగా 10 మందికి కరోనా వైరస్ సోకింది. సోమవారం ఉదయం వరకు 6,442 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో బాధితుల సంఖ్య 60,085కు చేరింది. వీరిలో 168 మంది వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 58,431 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో జిల్లాలో ఒకరు కరోనా వైరస్తో మృతి చెందగా మృతుల సంఖ్య 485కు చేరింది.