చెస్ విజేతలకు చెరో కోటి
ABN , First Publish Date - 2022-08-11T08:58:26+05:30 IST
చెస్ ఒలింపియాడ్ పోటీల్లో కాంస్య పతకాలు గెలుచుకున్న రెండు భారత జట్లకు..
చెన్నై (ఆంధ్రజ్యోతి): చెస్ ఒలింపియాడ్ పోటీల్లో కాంస్య పతకాలు గెలుచుకున్న రెండు భారత జట్లకు తలో రూ.1 కోటి చొప్పున తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అందజేశారు. ఓపెన్ కేటగిరీలో పతకం గెల్చుకున్న ఇండియా-బి జట్టును, మహిళల విభాగంలో పతకం అందుకున్న ఇండియా-ఎ జట్టును బుధవారం సచివాలయానికి ఆహ్వానించిన సీఎం.. ఆ మొత్తాన్ని అందజేశారు.