కేటీఆర్ విదేశీ పర్యటనలో మార్పు
ABN , First Publish Date - 2022-05-18T08:02:29+05:30 IST
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది.
దావోస్కి ముందు ఐదు రోజులు యూకేలో
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈనెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్కి జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనాల్సి ఉంది. అయితే దీనికి ఐదు రోజుల ముందు యూకేలోనూ పర్యటిస్తారని మంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. యూకే, స్విట్జర్లాండ్లో మంత్రి 11 రోజులపాటు పర్యటించనున్నట్లు వెల్లడించింది. లండన్లో పారిశ్రామికవేత్తలతో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటారని, అనంతరం దావోస్ సదస్సులో ప్రసంగిస్తారని మంత్రి కార్యాలయం పేర్కొంది. కాగా, కేటీఆర్ మంగళవారం యూకేకి పయనమయ్యారు.