వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-17T06:42:13+05:30 IST
మండలంలోని తెనగల్లు గ్రామానికి చెందిన స్వర్ణలత (24) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తల్లిదండ్రులకు భారం కాకూడదని యువతి..
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..
కుందుర్పి, మే 16 : మండలంలోని తెనగల్లు గ్రామానికి చెందిన స్వర్ణలత (24) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కురుబ భీమప్ప, రత్నమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. తనకు పెళ్లి కాకపోవడంతో తల్లిదండ్రులకు భారం కాకూడదని ఇంట్లో ఎవరూలేని సమయంలో బాత రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు కనబడకపోవడం చుట్టుపక్కల గాలించారు. బాతరూమ్లో విగతజీవిగా కనబడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాడిపత్రిటౌన : పట్టణంలోని టీచర్స్కాలనీలో నివాసముంటున్న రంగనాథ (30) సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ ధరణీబాబు తెలిపిన వివరాల మేరకు.. రంగనాథ అకౌంటెంట్గా పనిచేసేవారు. రెండు నెలల నుంచి పనిలేకుండా ఇంటివద్దనే ఖాళీగా ఉంటున్నాడు. దీంతో మానసికంగా, ఆర్థికంగా కుంగిపోయి సోమవారం రాత్రి ఇంటిలో ఎవరూలేని సమయంలో ఫ్యానకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగనాథకు భార్య ధనలక్ష్మి, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ధనలక్ష్మి 8 నెలల గర్భిణి. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు