బస్‌ టికెట్‌తో పాటే తిరుమల దర్శనం టోకెన్‌

ABN , First Publish Date - 2022-07-02T05:19:17+05:30 IST

Tirumala Darshan token along with bus ticket

బస్‌ టికెట్‌తో పాటే తిరుమల దర్శనం టోకెన్‌

 తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సదుపాయం కల్పించిన ఆర్టీసీ


సంగారెడ్డిఅర్బన్‌, జూలై 1:   తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల కోసం టీఎస్‌ ఆర్టీసీ శుభవార్త ప్రకటించిందని ఆర్టీసీ ఆర్‌ఎం సుదర్శన్‌ తెలిపారు. తిరుమల వెళ్లే బస్సు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే సమయంలోనే దర్శనం టికెట్‌(300) బుక్‌ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. టికెట్‌ బుక్‌ చేసుకున్న భక్తులకు స్థానిక బస్సులో తిరుపతి నుంచి తిరుమలకు తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం చేయిస్తారని పేర్కొన్నారు. ప్రతి రోజు ఇలాంటి టికెట్లు 1000 మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అయితే వారం రోజుల ముందు బస్‌ టికెట్‌తో పాటు దర్శనం టికెట్‌ కూడా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సంగారెడ్డి నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మెదక్‌ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతికి బస్సులు నడపనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-07-02T05:19:17+05:30 IST