తెలంగాణ కేసీఆర్ జాగీరా?: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-07-02T03:44:15+05:30 IST
Hyderabad: సీఎం కేసీఆర్పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.హైదరాబాదు ఏమైనా పాకిస్తానా, బంగ్లాదేశా..? తెలంగాణ ఏమైనా కేసీఆర్ జాగీరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hyderabad: సీఎం కేసీఆర్పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.హైదరాబాదు ఏమైనా పాకిస్తానా, బంగ్లాదేశా..? తెలంగాణ ఏమైనా కేసీఆర్ జాగీరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ మద్దతు ఇవ్వకపోతే నీవు సీఎం అయ్యేవాడివా?
‘‘ కార్యవర్గ సమావేశాలే కాదు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశాం. నీ సంగతి చూసేందుకే హైదరాబాదులో కార్యవర్గ సమావేశాలు పెట్టాం. హైదరాబాదులో కార్యవర్గ సమావేశాలు పెట్టేందుకు మీ అనుమతి తీసుకోవాలా..? తెలంగాణ రాష్ట్రానికి నువ్వేం చేసావు..? తెలంగాణ మొదటి ద్రోహి నువ్వే.. పార్లమెంట్లో బిల్లు పెడితే.. బీజేపీ మద్దతు ఇవ్వకపోతే నీవు సీఎం అయ్యేవాడివా? బీజేపీ వల్లే నీవు ముఖ్యమంత్రి అయ్యావు. 1200 మంది బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. కానీ నీవు, నీ కుటుంబం రాజ్యం ఏలుతున్నారు. దళితున్ని ముఖ్యమంత్రి ఎందుకు చేయలే..? దళితులకు దళిత బంధు ఎందుకివ్వలేదు..? ఇంటికి ఒక ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదు’’అని కేసీఆర్ను ప్రశ్నించారు.