పరుగుపందెం పోటీలకు విశేష స్పందన
ABN , First Publish Date - 2021-10-29T04:58:33+05:30 IST
బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగు పందేలకు విశేష స్పందన లభించింది.
పోరుమామిళ్ల, అక్టోబరు 28: బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగు పందేలకు విశేష స్పందన లభించింది. బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల, మైదుకూరులో నిర్వహించిన పోటీలకు సుమారు 350 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 1500 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ నిర్వహించారు. ఈ పోటీలకు దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
1500 మీటర్ల పరుగు పందెంలో విజేతలు 30న జరుగనున్న జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు ప్రిన్సిపాల్ జయసుబ్బారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు అనీల్, శ్రీను, రవి, సరళ పాల్గొన్నారు.
మైదుకూరు, అక్టోబరు 28: మైదుకూరులో నిర్వహించిన పరుగుపందేలకు స్పందన లభించిం ది. మేధా డిఫెన్స్ అకాడమీ మైదానంలో అకాడమీ వైస్ ఛైర్మన్ లోకేష్ ప్రారంభించిన 100, 1500 మీటర్ల పరుగు పందెం పోటీలకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారన్నారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రం అందచేశారు.