ప్రజా సేవకే మొదటి ప్రాధాన్యత
ABN , First Publish Date - 2022-07-02T05:01:13+05:30 IST
పోలీ్సశాఖ ప్రజలకు సేవ చేయడంలో మొదటి ప్రాధాన్యత నిస్తోందని అదే స్థాయిలో నేరాల అదుపునకు అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటుందని ఎర్రగుంట్ల సీఐ ఎన్.రవీంద్రనాధ్రెడ్డి అన్నారు.
చెన్నూరు, జూలై 1: పోలీ్సశాఖ ప్రజలకు సేవ చేయడంలో మొదటి ప్రాధాన్యత నిస్తోందని అదే స్థాయిలో నేరాల అదుపునకు అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటుందని ఎర్రగుంట్ల సీఐ ఎన్.రవీంద్రనాధ్రెడ్డి అన్నారు. చెన్నూరు మండలాన్ని ఎర్రగుంట్ల సర్కిల్ పరిధిలోకి కలపడంతో శుక్రవా రం చెన్నూరు పోలీ్సష్టేషన్ను సందర్శించి తనిఖీ చేసిన సీఐ మాట్లాడుతూ గతంలో చెన్నూరు మం డలం కడప 2టౌన్ పరిధిలో ఉండేదని మార్పులు చేర్పుల్లో భాగంగా ఎర్రంగుంట్ల సర్కిల్పరిధిలోకి చెన్నూరు, కమలాపురం, వీరపునాయునిపల్లె మం డలాలను కూడా చేర్చారన్నారు.
మండలం సమస్యాత్మకమైన ఇబ్బందులు లేకున్నా హైవే ఉన్నందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబ ట్టి ప్రజల రాకపోకల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో ప్రతి వాహనదారుడు వాహన రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలన్నా రు. పైగా లంకమల్ల అడవులు ఉన్నందున ఈ ప్రాంతం ఎర్రచందనానికి సెలవు కాబట్టి ఇటీవల చాలా మంది స్మగ్లర్లను అరెస్టు చేశామని ఎంతో విలువైన ఎర్రచందనం జోలికి ఎవరు వెళ్లినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా, మట్కా, గ్యాంబ్లింగ్, గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేసే సంఘటనలు ఈవ్ టీజిం గ్, పాత కక్షలతో దాడులు, అనవసరంగా రెచ్చగొట్టుకోవడాలు లాంటి విషయాల జోలికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధా నంలో ప్రజలు ఎవరైనా సమస్యలను అధికారుల దృష్టికి నిర్భయంగా తీసుకెళ్లి సలహాలు, సహా యం పొందవచ్చని సూచించారు. పోలీసు శాఖ ప్రజల సేవ కోసమే ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని వారి సహకారాలు కూడా అందిస్తే ప్రతి గ్రామం సమస్యల నుంచి పూర్తిగా వైదొలిగి శాంతియుత వాతావరణాన్ని ఏర్పరుచుకోగలదన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.