Home » Andhra Pradesh » West Godavari
వాతావరణ మార్పు దాళ్వా రైతులను భయపెడుతోంది. గడిచిన మూడు రోజులుగా మబ్బులు పట్టడం, ఎండ తీవ్రత తగ్గడం రైతులను భయపడేలా చేసింది.
వ్యాపారుల చేతిలో రైతు దగా పడుతున్నాడు. ఈ ఏడాది వర్షా భావంతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గింది. మరోవైపు ధర ఆశాజనకంగా లేకపోవడంతో రైతాంగం నష్ట పోయారు.
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధ్దీకరణ జీవోలకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా నిలుస్తోందేమోనన్న భయాందోళనలు సంబంధిత ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ద్వారకా తిరుమలలో వీధికుక్కల భయం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కఽథనాలపై ఆలయ అధికారులు స్పందించారు. క్షేత్ర పరిసరాలలో తిరుగుతున్న వీధి కుక్కలను పట్టించి మూడు వ్యాన్లలో అటవీ ప్రాంతాలకు తరలించారు.
తంగెళ్ళమూడి కండ్రికగూడెంలో వైసీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అండతో ఓ వ్యక్తి మునిసిపల్ కార్పొరేషన్ స్థలాన్ని ఆక్రమించి షాపు ఏర్పాటుకు పూనుకు న్నాడు. ఇది కార్పొరేషన్కు చెందిన స్థలమని హెచ్చరిక బోర్డు ఉన్నా దానిని లెక్కచేయకుండా నిర్మాణం సాగిస్తుండ డంతో స్థానికులు అడ్డుకు నేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తి వారిపై గొడవకు దిగాడు.
వలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి ప్రచారం చేస్తున్నారు. రూపాయి కూడా అందుకోని వారిని లబ్ధిదారులుగా చెబుతూ ఇంటింటికి వచ్చి పత్రాలు ఇవ్వడంతో విస్తుపోతున్నారు.
పేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ టీడీపీ ప్రభుత్వ హయాంలో దిగ్విజయంగా అమలు చేశారు. ఎంతో మంది పేద విద్యార్థుల కలలు సాకారమయ్యాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగనన్న విద్యాదీవెన పేరుతో ఫీజు రీయింబర్స్మెంట్ అందని ద్రాక్షగానే మారింది.
ఏలూరు లోక్సభ స్థానం నుంచి తెలుగు దేశం పక్షాన అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొన సాగుతోం ది. ఇన్నాళ్లలో ఏలూరు స్థానం ప్రతిష్ఠంభనలో పడడం దాదాపు ఇదే ప్రథమం. ఈ స్థానం నుంచి బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు టీడీపీ యోచి స్తుండడంతో దానికి తగ్గట్టుగానే ఆశా వాహుల సంఖ్య పెరిగింది.
కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. రెగ్యులర్ విద్యార్థులకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగియగా, ఆరోపణలు వెల్లువెత్తే ‘ఓపెన్’ ఇంటర్ పరీక్షల్లో ఓ మాల్ప్రాక్టీస్ కేసు నమోదైంది.
రాష్ట్రంలో రానున్నది కూటమి ప్రభుత్వమేనని ప్రజాగళం సభ విజయవంతం కావడమే నిదర్శనమని టీడీపీ జిల్లా అధ్యక్షు డు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు.