Home » Andhra Pradesh » Srikakulam
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల ముందు జిల్లాలోనే పాదయాత్ర ముగించారు. ప్రతి నియోజకవర్గంలోనూ సభలు నిర్వహించి.. జిల్లావాసులకు ఎన్నో హామీలిచ్చారు. ‘ఒక్క చాన్స్’ ఇస్తే ఏళ్ల తరబడిగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించి.. అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రకటించారు.
ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయం గురించి సగటు ఓటరులో ఆసక్తికరంగా ఉంటుంది. ఎంత ఖర్చుచేయవచ్చు, ఎలా ఖర్చు చేయాలన్న విషయంపై ఎన్నికల కమిషన్ నిబంధనలు మేరకు ఆచరించాలి. తాజాగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకావడంతో జోరుగా ఎన్నికల ఖర్చు గురించి జరుగుతోంది. ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపునకు డబ్బు కీలకంగా మారింది. ఎన్నికల సంఘం నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో వ్యయ పరిమితిపై ఈసీ నిబంధనలు జారీచేసింది.
ఓటు వేశారా? అంటే నోటితో సమాధానం చెప్పనవసరం లేదు. నేరేడు రంగులో ఉన్న సిరా గుర్తున్న వేలుని చూపిస్తే చాలు. సిరా చుక్కకు, ఓటుకు ఉన్న సంబంధం అటు వంటిది. ఈ సిరా వేస్తేనే ఓటు హక్కు వినియోగించుకున్నట్లు గుర్తింపు ఉంటుంది. ఓటు వేసిన పౌరులకు ఆ సిరా ఎక్కడ తయారవుతోందోనన్న సందేహాలు ఉంటాయి.
ఎన్నికల్లో అఫిడవిట్ కీలకంగా మారింది. నామినేషన్ పత్రాల తో పాటు ఫారం-26 అఫిడవిట్ దాఖలు చేయాలి. అభ్యర్థులు తమ వివరా లతో పాటు ఆస్తులు,అప్పుల గురించి ప్రమాణపత్రం రూపంలో స్పష్టంచేయాలి. గతంలో ఏమైనా కేసులు ఉన్నా, శిక్షపడినా వాటినీ పొందు పరచాలి. ఇందులో తప్పుడు సమాచారం ఇస్తే అదే ప్రత్యర్థుల కు ఆయుధమై కోర్టు కేసుల వరకు వెళ్లడమే కాకుండా అనర్హతవేటుకు దారితీసే అవకాశముంటుంది.
ఎంతో అట్టహాసంగా గత ఏడాది డిసెంబరు 13 ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. కిడ్నీ రోగులకు పెద్ద ఉపకారం చేశామని బిల్డప్ ఇచ్చారు.
మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గతేడాది ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. నేటికి (శుక్రవారం) సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. కానీ, పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.
ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా ఉంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులకే ఓటర్లు పట్టంకట్టారు.
పేదల సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు వారికి టిడ్కో గృహాలను అందించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో డీడీలు కట్టిన పేదలు టిడ్కో గృహాల అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క ఇళ్లు అందక.. మరోపక్క కట్టిన డబ్బులు తిరిగి రాక ఆందోళన చెందుతున్నారు. జగనన్నా మా గోడు పట్టదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కీలక నియోజకవర్గమైన టెక్కలిలో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు ఇంటిపోరు మొదలైంది. తాను ఈనెల 22న నామినేషన్ వేస్తానని ఆయన సతీమణి వాణి శుక్రవారం ప్రకటించడంతో అధికారపార్టీలో కలకలం మొదలైంది.
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ సెగెంట్ల పరిధిలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు.