Home » Andhra Pradesh » Prakasam
అభ్యర్థుల ఎంపికలో వైసీపీ అనుసరించిన బదిలీల వ్యూహం పార్టీకే తలనొప్పిగా మారింది. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న వారి అనుచరులు కొత్త నియోజకవర్గాలకు చేరిపోయారు.
వైసీపీ నేతల ప్రచార పిచ్చి పాడుగాను.. వాటిని తొలగించడానికి మున్సిపల్ సిబ్బంది నానా అగచాట్లు పడుతున్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా అధికారం అడ్డుపెట్టుకుని మేయర్ గంగాడ సుజాత పంచిన ఎన్నికల బహుమతులపై జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ సీరియస్ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు.
జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజైన సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 170 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
మండలంలోని పలు గ్రామాలలో తాగునీటి సమస్యను దూరం చేసేందుకు ప్రతిపాదించిన త్రిపురాంతకం చెరువులలో ఎస్ఎస్ ట్యాంకు నిర్మాణం కలగానే మిగిలిపోయింది.
అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబు సీఎం అయితేనే సాధ్యపడుతుందని టీడీపీ ఎస్ఎన్పాడు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్యెల్యే బీఎన్ విజయ్కుమార్ అన్నారు.
జిల్లా పంచాయతీ ఇన్చార్జి అధికారిగా గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ అధికారి ఉషారాణి బాధ్యతలు స్వీకరించారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియామావళిని తప్పనిసరిగా పాటించి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినే్షకుమార్ కోరారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నిర్వహణలో అధికార పాత్ర ఎంతో ఉందో, రాజకీయ పార్టీల నుంచి కూడా అంతే సహకారం అవసరం ఉందన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్య వైశ్యులను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని, త్వరలో జరిగే ఎన్నికల్లో వైశ్యులంతా ఒక్కటై తెలుగుదేశం పార్టీని గెలిపించి, వైసీపీ తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ కోరారు. సోమవారం నగరంలోని 15వ డివిజన్ సంతపేటకు చెందిన వైసీపీ సానుభూతిపరులైన వైశ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో విచ్చేసిన వారిని దామచర్ల పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ సైకో జగన్ సీఎం అయ్యాక ఆర్యవైశ్యులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.