Home » Andhra Pradesh » Prakasam
ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని మాదిగలను నమ్మించి వంచించిన ద్రోహి జగన్రెడ్డి అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ అన్నారు. అమరావతి గ్రౌండ్స్లో గురువారం కూటమి సంఘీబావ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తన తండ్రి చివరి కోరిక అని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మా ట తప్పిన మాదిగ ద్రోహి జగన్ అని దుయ్యబట్టారు. వైసీపీ వచ్చాక దళితులపై దాడులు పెచ్చురిల్లాయన్నారు. పైకి మాత్రమే నా ఎస్సీలు అంటూనే లోలోపల ఎస్సీలను అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి 10రోజులు అవుతున్నా కోడ్ అమలు చేయడంలో అధికారులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. నిబంధనలు అమలు చే యాల్సిన అధికారులు ఇంకా అలసత్వం వీడడంలేదన్న విమర్శలు ఉన్నాయి.
దర్శి పట్టణంలోని తూర్పుగంగవరం రోడ్డులో నిర్మించ తపపెట్టిన టీటీడీ కల్యాణ మండపం శంకుస్థాపనకే పరిమితమైంది. రెండేళ్ల కిందట రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన టీటీడీ కల్యాణ మండపానికి అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అట్టహాసంగా భూమిపూజ చేశారు.
పని వికేంద్రీకరణలో భాగంగా ఇంటర్ మా ర్కుల స్కానింగ్కు ఈఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆయా మూల్యాం కన కేంద్రాల వద్దే ఏర్పాట్లు చేశారు. వచ్చేనెల 4వతేదీతో ఇంటర్మీడియేట్ జ వాబుపత్రాల మూల్యాంకనం పూర్తికానుంది.
జిల్లాలో ఎన్ని కల కోడ్ అమలులో ఉన్నందున లైసెన్సులు కలిగి న ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. కొత్తగా ఎ లాంటి లైసెన్సులు మంజూరు చేయరాదని స్పష్టం చేశారు.
ఎన్నిక కోడ్ వచ్చిన తరువాత అద్దంకి ప్రాంతంలో ఇసుక రవాణాపై మైనింగ్ అధికారుల తనిఖీలు పెరిగాయి. దీంతో ఇసుక రవాణా పూర్తిగా నిలిచింది. దీనినిబట్టి ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు జరిగాయన్న అనుమానాలకు మరింత బలం చేకూరింది. గుండ్లకమ్మ నదిలో అద్దంకి ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి రీచ్ను అధికారికంగా గుర్తించలేదని గ తంలో మైనిగ్ అధికారులు ప్రకటించారు.
మద్దిపాడు మండ లం గుండ్లకమ్మ ప్రాజె క్టులో చేపల వేట సాగి స్తున్న మత్స్యకారుల వలలో మొసలి పడింది. ఒడ్డుకు లాగే సరికి అది మృతి చెందింది.
వైసీపీ ప్రభుత్వ పాలనలో దివాళా తీసిన రాష్ర్టానికి జనసత్వాలు అందించాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని ఆపార్టీ బాపట్ల పార్లమెం ట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. గురువారం సాయంత్రం మార్టూరులోని తూర్పుబజా రున ఉన్న వినాయక స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రం లో వైసీపీ అరాచక పాలన అంతం కావాలని స్వామి వా రిని ప్రార్ధించినట్టు చెప్పారు. అనంతరం జరిగిన కార్యక్ర మంలో తూర్పుబజారుకు చెందిన వైసీపీకి చెందిన సీని యర్ నేత కొనకంచి మురళి తన అనుచరులతో ఏలూరి సమక్షంలో పార్టీలో చేరారు.
మార్కాపురం పట్టణంలో భూఆక్రమణదారులు రోజురోజుకు పెరుగుతు న్నాయి. కాస్త జాగ కనిపిస్తే చాలు పాగా వేసి బరితెగించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.