Home » Andhra Pradesh » Krishna
ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా ఈనెల 21వ తేదీన 1,872 మంది అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షలు రాయనున్నారని, ఐదు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని, లోటుపాట్లు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఎస్.దిల్లీరావు ఆదే శించారు.
ఓటు హక్కు ఉన్నవారంతా ప్రజాస్వామ్యస్ఫూర్తితో ఓటేయాలని ప్రజలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దిల్లీరావు, విజయవాడ పార్ల మెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయపరిశీలకుడు వి.జస్టిన్, విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తిరువూరు, మైలవరం ఎన్నికల వ్యయ పరిశీలకుడు సౌరభ్శర్మ, విజయ వాడ తూర్పు, నందిగామ, జగ్గయ్యపేట ఎన్నికల వ్యయ పరిశీలకుడు మదన్ కుమార్ పిలుపునిచ్చారు.
‘ఐదేళ్లలో వైసీపీ చేసిన ఘోరాలెన్ని? తగిలిన గాయాలెన్ని? పోయిన ప్రాణా లెన్ని? గులకరాయి గాయంపై వాపోతున్న జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి?’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్శదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాం డ్ చేశారు.
ఇబ్రహీంప ట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మంత్రి జోగి రమేశ్ బంధువులు ఆయన ఇంటి ముందే సభాస్థలి ఏర్పాటుచేసి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మైలవ రం అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు.
ప్రజా సంక్షేమంతో కూడిన రాష్ట్రా భివృద్ధి టీడీపీ కూటమితోనే సాధ్యమని మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు అన్నారు. బొమ్ములూరు ఎస్సీ కాలనీలో శుక్రవారం టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఇంటింటి ప్రచారంలో యార్లగడ్డ సతీష్తో కలిసి పాల్గొన్నారు. సూపర్సిక్స్ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకురు తుందని ప్రజలకు వివరిస్తూ, అభ్యర్థుల గుర్తులను చూపుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.
నామినేషన్ల జాతర రెండోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. రెండు జిల్లాల్లో భారీగానే నామినేషన్లు పడ్డాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, ఇతర రాజకీయ పక్షాలతో పాటు స్వతంత్రులు, సోషలిస్టు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 18, కృష్ణాజిల్లాలో 8 దాఖలయ్యాయి. అభ్యర్థుల ర్యాలీలు, ప్రచారాలతో ఎన్నికల పండుగ వాతావరణం కనిపిస్తోంది.
గులకరాయి సానుభూతి అస్త్రం వైసీపీ నెత్తిన బండరాయిగా మారింది. కేవలం వడ్డెర కులాన్ని టార్గెట్గా చేసుకుని ఎన్నికల్లో సానుభూతి పొందాలన్న పన్నాగం చివరికి వైసీపీ మెడకే చుట్టుకుంది. ఒక కులానికి చెందిన మైనర్లయిన బాలురును అదుపులోకి తీసుకోవడం, పోలీసులు ఏ2గా చెబుతున్న వేముల దుర్గారావును ఇంతవరకు కుటుంబ సభ్యులకు చూపించకపోవడంతో వడ్డెర కులస్తులు పిడికిలి బిగించారు. ఎన్నికల ముందు మైలేజ్ కోసం తమ కులాన్ని దోషిగా చిత్రీకరించారని ఆగ్రహిస్తూ భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.
నమ్మిన సిద్ధాంతానికి కడదాక కట్టుబడిని నిస్వార్ధ ప్రజాసేవకుడు, త్యాగశీలి సర్ధార్ గౌతు లచ్చన్న అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ కీర్తించారు. గౌతులచ్చన్న సేవాసమితి అధ్యక్షుడు కాగిత కొండ ఆధ్వర్యంలో శుక్రవారం లచ్చన్న 18వ వర్ధంతి నిర్వహించారు.
మే 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు విజయవంతంగా నిర్వహించడం ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకువద్దామని ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ పిలుపునిచ్చారు.
సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బొండా ఉమా, సీపీఎం అభ్యర్థిగా సీహెచ్ బాబూరావు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు.