Home » Telangana » Karimnagar
ఎప్పటిలాగే ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అమ్మాయిలదే హవా కొనసాగింది. జనరల్, ఒకేషనల్ రెండు కోర్సుల్లోనూ బాలికలు సత్తాచాటారు. బుధవారం వెల్లడైన ఫలితాల్లో జిల్లా ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి సంవత్సరం 13వ స్థానంలో, రెండో సంవత్సరంలో 16వ స్థానంలో నిలిచింది.
జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 64.29 శాతం, ప్రథమ సంవత్సరంలో 51.69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరంలో బాలికలు 3,376 మంది పరీక్షలకు హాజరుకాగా 2,481 మంది 73.49 శాతం ఉత్తీర్ణత కాగా, బాలురు 2,365 మంది హాజరుకాగా 1,210 మంది 51.16 శాతం ఉత్తీర్ణులయ్యారు.
సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహ ణ జరిగేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అధికారు లను ఆదేశిం చారు.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. మండలంలోని అల్లీపూర్లో గల డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ల ద్వారా శుద్ధి చేసి ప్రభుత్వం సూచించిన విధంగా తూకం వేయాలన్నారు.
సింగరేణిని కాపాడడం కోసం ఉద్యో గులు నడుం బిగించాలని టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యా ల రాజిరెడ్డి పిలుపునిచ్చారు.
ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దేవుడిపై ఒట్లు పెడుతూ రాజకీయం చేస్తున్నారని కరీంనగర్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
సింగరేణి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్ అధికారులకు సూచించారు.
చట్టాన్ని చుట్టంలా చేసుకొని మర్డర్లు చేసి తిరుగుతున్నా రని, చట్టం ఎవరికి చుట్టం కాదని, వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుం టామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో స్థానికులకే ఓటు వేయాలని బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ గొమాసే కోరారు.
దేశం కోసం, ధర్మ రక్షణ కోసం బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. బుధవారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్కు చెందిన నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.