Home » Andhra Pradesh » Guntur
Andhrapradesh: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ‘‘ప్రజాగళం’’ బహిరంగసభలో పోలీసుల సహాయ నిరాకరణపై కూటమిలోని సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నిన్ననే (ఆదివారం) ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సభలో ఎక్కడా పోలీసు కనిపించని అంశాన్ని నేరుగా సభలోనే ప్రధాని ప్రస్తావించారు. కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
గుంటూరు జిల్లా తెనాలి మునిసిపల్ కార్యాలయం వెనుక వ్యక్తి సజీవ దహనమైన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఆటో రవి అనే యాచకుడు మంటల్లో కాలిపోయి మృతి చెందాడు. అయినవారు ఎవరూ లేకపోవడంతో యాచక వృత్తి చేసుకుంటూ మున్సిపల్ కార్యాలయం వెనుక పాత భవనంలో రవి ఉంటున్నాడు. గత రాత్రి నిద్రిస్తుండగా మస్కిటో కాయిల్స్ నుంచి మంటలు చెలరేగి సజీవదహనమయ్యాడు.
PM Narndra Modi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై(YS Jagan) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అవినీతి ప్రభుత్వాన్ని పెకిలించాల్సింది రాష్ట్ర ప్రజలేనని అన్నారు. ఆదివారం చిలకలూరి పేట పరిధిలో జరిగిన ప్రజాగళం సభకు(Prajagalam Sabha) ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. జగన్ తనకెవరూ అడ్డు లేరని భావిస్తున్నాడని, అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు పడగొట్టాల్సిందేనని..
Prajagalam Sabha: చిలకలూరిపేటలోని బొప్పూడిలో ఎన్డీయే ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాగళం (Prajagalam) సభకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉప్పెనలా తరలి వచ్చారు. సభా ప్రాంగంణం నిండి రోడ్లపైనా బారులు తీరారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన చీఫ్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి రానున్నారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేయడమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమిగా పోటీచేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణబద్ధులయ్యేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయి. పొత్తు కుదిరిన తర్వాత మూడు పార్టీల తొలి ఉమ్మడి సభకు వేదికైంది పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట.
Andhrapradesh: టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి శనివారం మౌర్యా ఫంక్షన్ హాల్లో సమావేశమైంది. రేపు (ఆదివారం) చిలకలూరిపేటలో జరగనున్న సభ, కలిసి ముందుకు వెళ్ళాలన్న అంశంపై సమావేశంలో చర్చించారు. సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, మూడు పార్టీల జిల్లా స్థాయి నేతలు హాజరయ్యారు.
Andhrapradesh: అమెరికాలో గుంటూరు జిల్లా విద్యార్థి దారుణ హత్య కలకలం రేపుతోంది. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న పరుచూరి అభిజిత్ (20)ను ఈనెల 11న యూనివర్సిటీ క్యాంపస్లోనే గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. సెల్ నెంబర్ ఆధారంగా మృతదేహాన్ని పోలీసులు అడవిలో గుర్తించారు. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
Andhrapradesh: జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ - వైసీపీ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. గత రాత్రి అనంతవరం, దోడ్లేరు గ్రామాల్లో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్కు చెందిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. అయితే ఉదయం తొమ్మిది గంటల సమయంలో అమరావతి మండలం ధరణికోటలో వైసీపీ కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారు.
టాలీవుడ్ డైరెక్టర్, తన స్నేహితుడు త్రివిక్రమ్ గురించి జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళగిరిలోని(Mangalagiri) జనసేన సెంట్రల్ ఆఫీస్లో మాట్లాడిన పవన్.. రానున్న ఎన్నికల్లో జగన్ను(Jagan) ఓడించడం, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపొందాల్సిన అవశ్యకతను వివరించారు. ఇదే సమయంలో త్రివిక్రమ్(Trivikram Srinivas) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కల్యాణ్.
గుంటూరు జిల్లా: తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగిన భర్త, భార్య, కుమార్తె. ఈ ఘటనలో భార్య నాగమణి మృతిచెందగా.. భర్త శివ శంకర్రావు , కుమార్తె హారిక. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.