తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో పంచగామలోని విఠలేశ్వర ఆలయ పరిసరాల్లో గంజాయి కలకలం రేపింది. పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి, 15 కిలోల ఎండు గంజాయి, లక్ష రూపాయలతో పాటు సుమారు 600 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. దీని విలువ రూ.70లక్షలు ఉంటుందని అంచనా. గంజాయి సాగులో ఓ స్వామీజీ హస్తం ఉన్నట్టు సమాచారం.