స్పందించని వి.కావేరి యాజమాన్యం..? బాధ్యత ఉండక్కర్లేదా..?
ABN, Publish Date - Oct 24 , 2025 | 01:10 PM
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
కర్నూలు: జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబరు 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిసింది. 9 సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనల పైనా చలాన్లు పడినట్లు తెలిసింది. అయితే ఇప్పటి వరకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాన్యం ఇంక స్పందించిక పోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది.
Updated Date - Oct 24 , 2025 | 08:51 PM