రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అద్భుతమైన పోరాటం చేసి 332 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ నాలుగు, హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు.