టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అక్టోబర్ నెల స్వామివారి దర్శనం, ఆదాయ వివరాలను వెల్లడించారు. అక్టోబర్లో శ్రీవారిని 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 119.35 కోట్లు ఆదాయం లభించింది. అదే నెలలో 1.23 కోట్ల లడ్డూలు విక్రయించగా, 34.20 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. 8.31 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.