పాకిస్థాన్ హద్దులు దాటేస్తోంది. భారత్ సహనాన్ని పరీక్షించడమే కాకుండా.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు నగరాలపై దాడులకు విఫలయత్నం చేసిన పాక్.. ఇప్పుడు దేవాలయాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. జమ్మూలోని ఆప్ శంభు ఆలయంపై పాక్ మిస్సైల్తో దాడి చేసినట్లు, దేవాలయం వెలుపలున్న భవనం ధ్వంసమైనట్లు వీడియో వైరలవుతోంది.