పూర్తి కాకముందే భవనాల ఓపెనింగ్ చేసిన జగన్
ABN, Publish Date - Mar 08 , 2024 | 10:25 AM
గుంటూరు: పనులు పూర్తి కాకపోయినా సీఎం జగన్ భవనాలు ప్రారంభిస్తున్నారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించడమే అందుకు నిదర్శనం.
గుంటూరు: పనులు పూర్తి కాకపోయినా సీఎం జగన్ భవనాలు ప్రారంభిస్తున్నారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించడమే అందుకు నిదర్శనం. కనీసం కార్యాలయం అద్దాలు, విద్యుత్ ఉపకరణాలు బిగించే పనులు పూర్తి కాకుండానే సీఎం జగన్ ప్రారంభిచండం విశేషం. నిర్మాణ పనులు పూర్తి చేసే విషయంలో శ్రద్ధ చూపని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రారంభానికి మాత్రం హడావుడి చేసింది. కేంద్ర నిధులతో నిర్మిస్తున్న భవనాలకు తాము నిర్మిస్తున్నట్లు వైసీపీ సర్కార్ ఫోజులిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 08 , 2024 | 10:25 AM