Live..: ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ABN, Publish Date - Jul 23 , 2024 | 12:01 PM
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభమైంది. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రాజమండ్రీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నపై చర్చ మొదలైంది.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభమైంది. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రాజమండ్రీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నపై చర్చ మొదలైంది. ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణకు నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
ఆగస్టు 31లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారన్నారు. రిపోర్ట్ వచ్చిన తరువాత సభ్యులు కోరిన విధంగా సీఎం ఆదేశాలు తీసుకుని సీబీఐ విచారణకు సిఫార్సు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. దీనిపై అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి లోకేష్ ఒక విచారణ కమిటీ నియమించారన్నారు. దీనిపై ఇప్పటికే అధికారులు విచారణ చేపట్టారని మంత్రి పయ్యావుల వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ (ఫోటో గ్యాలరీ)
కారు దిగనున్న మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!
ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్
దేశంలో భారీగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 23 , 2024 | 12:01 PM