Telangana: సీఎస్‎గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి ఎ.శాంతికుమారిని

ABN, First Publish Date - 2023-01-12T09:04:50+05:30 IST

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి ఎ.శాంతికుమారిని సీఎస్‎గా ప్రభుత్వం నియమించింది. 1989 ఐఏఎస్‌ బ్యాచ్‌కు

హైదరాబాద్: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి ఎ.శాంతికుమారిని సీఎస్‎గా ప్రభుత్వం నియమించింది. 1989 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖను పర్యవేక్షిస్తున్నారు. పలు తర్జనభర్జనల అనంతరం ఆమె నియామకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓకే చేశారు. సీఎం ఆదేశాలతో సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి వి.శేషాద్రి బుధవారం నియామక ఉత్తర్వులు (జీవో నంబర్‌ 71) జారీ చేశారు.

Updated at - 2023-01-12T09:22:27+05:30