Kavitha: కేసీఆర్ కృషితో రామప్పకు యునెస్కో గుర్తింపు

ABN , First Publish Date - 2023-01-22T12:14:03+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Kavitha: కేసీఆర్ కృషితో రామప్పకు యునెస్కో గుర్తింపు

ములుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) కృషితో రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kalvakuntla Kavitha) అన్నారు. ఆదివారం ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌ (Minister Satyavathi Rathod) తో పర్యటిస్తున్న కవిత... ప్రపంచ ప్రఖ్యాత కట్టడం రామప్ప ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... శిల్పి పేరుతో రామప్ప ఆలయాన్ని నిర్మించి కాకతీయులు ఈ ప్రాంతానికి వన్నె తెస్తే... యునెస్కో గుర్తింపు లభించేలా కృషిచేసి కేసీఆర్ రామప్ప ఖ్యాతి విశ్వవ్యాప్తం చేశారన్నారు. రామప్ప దేవాలయం మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్ ములుగు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. హెల్త్ ప్రొఫైల్ కోసం ములుగు జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం సంతోషకరమని కవిత పేర్కొన్నారు.

Updated Date - 2023-01-22T12:14:04+05:30 IST