పగిడివర్రిలో వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2023-02-07T00:48:38+05:30 IST

మండలంలోని పగిడిమర్రి గ్రా మ ఆలయ బ్ర హ్మోత్సవాల్లో భాగంగా సోమవారం గోవిందాంబ, వీరబ్రహ్మేంద్రస్వామివార్ల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, సన్నాయి వాయిద్యా లు, మేళతాళాల నడుమ వైభవంగా జరిగింది.

 పగిడివర్రిలో వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం
స్వామివారి కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు

పగిడివర్రిలో వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం

కనగల్‌, ఫి బ్రవరి 6: మండలంలోని పగిడిమర్రి గ్రా మ ఆలయ బ్ర హ్మోత్సవాల్లో భాగంగా సోమవారం గోవిందాంబ, వీరబ్రహ్మేంద్రస్వామివార్ల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, సన్నాయి వాయిద్యా లు, మేళతాళాల నడుమ వైభవంగా జరిగింది. వందలాది మంది భక్తులు పాల్గొ ని వడిబియ్యం సమర్పించుకున్నారు. సర్పంచ గోలి నర్సిరెడ్డిభాగ్యమ్మ దంపతు లు పట్టువసా్త్రలు, తలంబ్రాలు అందజేశారు. బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు చకి లం అనిల్‌కుమార్‌ కల్యాణోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చే శారు. సాయంత్రం గ్రామంలో స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు నీళ్లు ఆరబోసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం అగ్నిగుండాలను నిర్వహించటంతో జాతర ముగుస్తుందనిపేర్కొన్నారు. కార్యక్రమంలో సరంచ గోలి నర్సింరెడ్డి, ఎంపీటీసీ యశోదమ్మ, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన సింగం మల్లేష్‌, నాయకులు ఎర్రమాద వెంకట్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జ గాల్‌రెడ్డి, రవీందర్‌, కేశవరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:48:41+05:30 IST