TS News: అప్పు అడిగినందుకు వ్యక్తి హత్య

ABN , First Publish Date - 2023-01-28T20:05:15+05:30 IST

జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.20 వేలు అప్పు చెల్లించమన్నందుకు వ్యక్తిని హతమార్చారు.

TS News: అప్పు అడిగినందుకు వ్యక్తి హత్య

సంగారెడ్డి: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.20 వేలు అప్పు చెల్లించమన్నందుకు వ్యక్తిని హతమార్చారు. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్లో రెండురోజుల క్రితం ఘటన చోటుచేసుకుంది.తెల్లాపూర్ వాసి మల్లేశం దగ్గరపసుపుల చంద్రప్ప అప్పు తీసుకున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. రూ.20 వేలు అప్పు చెల్లించాలని అడిగిన మల్లేశంనుచంద్రప్ప చంపినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.రెండు రోజుల క్రితం వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు తెల్లపూర్ వాసి మల్లేశం(45)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-01-28T20:05:17+05:30 IST