దారుణం.. డబ్బు కోసం మైనర్ కూతుళ్లను..
ABN , First Publish Date - 2023-01-24T20:22:32+05:30 IST
జిల్లాలోని మాచారెడ్డి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బు కోసం ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది.

కామారెడ్డి: జిల్లాలోని మాచారెడ్డి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బు కోసం ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. మైనర్ కూతుళ్లను అమ్మిన సవతి తల్లి, తండ్రి రాజస్థాన్కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పెళ్లి జరిపించారు. అయితే ఆ మైనర్ బాలికలను శారీరకంగా వాడుకుని రాజస్థాన్ వ్యక్తులు వేధింపులకు గురిచేసినట్లు బాధితులు వాపోతున్నారు. మైనర్ బాలికలను పోలీసులు బాలసదన్కు తరలించారు. సవతి తల్లి, తండ్రి, పెళ్లి చేసుకున్న ఇద్దరు నిందితులు, సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు.