హైకోర్టు ఉత్తర్వులపై బండి సంజయ్ స్పందన
ABN , First Publish Date - 2023-01-25T17:59:14+05:30 IST
హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు.
హైదరాబాద్: హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. హైకోర్టు (Highcourt) ఉత్తర్వులు కేసీఆర్ సర్కార్కు చెంపపెట్టు వంటివన్నారు. పరేడ్తో కూడిన గణతంత్ర వేడుకలు నిర్వహించాలని బండి సంజయ్ సూచించారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ వ్యవస్థను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్య ద్రోహిగా కేసీఆర్ (CM KCR) నిలిచిపోతారని పేర్కొన్నారు.