Uttam Kumar Reddy: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-02-05T20:28:24+05:30 IST

ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల చివరినాటికి అసెంబ్లీ...

Uttam Kumar Reddy: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సూర్యాపేట: ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల చివరినాటికి అసెంబ్లీ (Assembly) రద్దు కాబోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రపతి పాలనలోనే ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ గాలి వీస్తోందని తెలిపారు. మతపరంగా దేశాన్ని బీజేపీ విచ్ఛిన్నం చేస్తోందని దుయ్యబట్టారు. కోదాడ, హుజూర్‌నగర్‌లో 50 వేల మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. దళితబంధులో కోదాడ ఎమ్మెల్యే కమిషన్ల కక్కుర్తికి పాల్పడుతున్నాడని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2023-02-05T20:30:04+05:30 IST