Revanth Reddy: కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

ABN , First Publish Date - 2023-02-03T19:00:29+05:30 IST

సీఎం కేసీఆర్‌ (CM KCR)కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) లేఖ రాశారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు, బడ్జెట్‌ (Budget)లో నిధుల కేటాయింపుపై లేఖలో ప్రస్తావించారు.

Revanth Reddy: కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ (CM KCR)కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) లేఖ రాశారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు, బడ్జెట్‌ (Budget)లో నిధుల కేటాయింపుపై లేఖలో ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని తప్పుబట్టారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల హామీ ఏమైంది? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ (Palamuru-Ranga Reddy Project)పై కేసీఆర్‌ నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి కేసీఆర్‌కు ఇదే చివరి ఛాన్స్‌ అని, హామీలు నెరవేర్చకపోతే కేసీఆర్‌కు ఓట్లు అడిగే హక్కు లేదని రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.

Updated Date - 2023-02-03T19:00:31+05:30 IST