ఆటో ఢీకొని మహిళ దుర్మరణం

ABN , First Publish Date - 2023-02-02T00:12:42+05:30 IST

విఠాయిపల్లి సమీపంలో వాటర్‌ ప్లాంట్‌ వద్ద హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై బుధవారం తెల్లవారు జామున ఆటో ఢీకొని మహిళ దుర్మరణం చెందింది.

ఆటో ఢీకొని మహిళ దుర్మరణం

ఆమనగల్లు, ఫిబ్రవరి 1: విఠాయిపల్లి సమీపంలో వాటర్‌ ప్లాంట్‌ వద్ద హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై బుధవారం తెల్లవారు జామున ఆటో ఢీకొని మహిళ దుర్మరణం చెందింది. ఎస్‌ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం రాచూరుకు చెందిన ప్రమీళమ్మ(45) నడుచుకుంటూ వెళ్తోంది. హైదరాబాద్‌ నుంచి కల్వకుర్తి వెళ్తున్న ఆటో ప్రమీళమ్మను ఢీకొనగా ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమీళమ్మ కుమారుడు వెంకటేశ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ వివరించారు.

Updated Date - 2023-02-02T00:12:44+05:30 IST