మూడు కార్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2023-02-02T00:07:16+05:30 IST
కందుకూరు చౌరస్తాలో బుధవారం సాయంత్రం కారు అదుపు తప్పి మరో మూడుకార్లను ఢీకొన్న ఘటనలో వ్యక్తి గాయపడ్డాడు.
కందుకూరు, ఫిబ్రవరి 1: కందుకూరు చౌరస్తాలో బుధవారం సాయంత్రం కారు అదుపు తప్పి మరో మూడుకార్లను ఢీకొన్న ఘటనలో వ్యక్తి గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వెర్ణ కారును హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న ఇన్నోవా కారు ఢీకొని రహదారిపై అడ్డంగా తిరిగింది. దాంతో మరో రెండు కార్లు వచ్చి ఇన్నోవాను ఢీకొట్టాయి. ఆ కార్లలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. కాగా పోలీసులు రాకముందే క్షతగాత్రులు వెళ్లిపోయారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొండల్ తెలిపారు.