శివస్వాములను అరెస్టు చేయాలి
ABN , First Publish Date - 2023-02-02T00:05:58+05:30 IST
యాలాల మండల పోలీ్సస్టేషన్ పరిధిలో శివస్వాముల వేషధారణలో వచ్చిన దాదాపు 30 మంది దేవనూర్ గ్రామానికి చెందిన దళిత యువకుడు నరేశ్పై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు.
కేవీపీఎస్ దళిత, ప్రజా సంఘాల నాయకులు
బొంరా్సపేట్/యాలాల, ఫిబ్రవరి 1: యాలాల మండల పోలీ్సస్టేషన్ పరిధిలో శివస్వాముల వేషధారణలో వచ్చిన దాదాపు 30 మంది దేవనూర్ గ్రామానికి చెందిన దళిత యువకుడు నరేశ్పై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బొంరా్సపేట్ మండల పరిధిలోని కొత్తూర్లో విలేకరులతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని యాలాల్ ఎస్సై, పోలీసు సిబ్బంది అడ్డగించినా సామూహికంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె లక్ష్మయ్య, కొత్తూర్ బల్రాం, మాజీ సర్పంచ్ ప్రవీణ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దళిత యువకుడిపై దాడి చేసిన శివస్వాములను వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్ దళిత, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. యాలాల కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కేఎన్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.చంద్రప్ప, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉప్పలి మల్కయ్య, తాండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆశన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.