స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి
ABN , First Publish Date - 2023-02-02T00:15:06+05:30 IST
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.5,500కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ మహేశ్వరం నగర కార్యదర్శి రాఘవేందర్ అన్నారు.
మహేశ్వరం, ఫిబ్రవరి 1: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.5,500కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ మహేశ్వరం నగర కార్యదర్శి రాఘవేందర్ అన్నారు. బుధవారం మహేశ్వరంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఏళ్లుగా స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంద న్నారు. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు కట్టలేక ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారన్నారు. అలాగే మహేశ్వరంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాంత్,మురళి,రాజేష్, సాయి తేజ, వినయ్, చంటి, బీజేవైఎం దేవేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.