నేటి నుంచి సమతా కుంభ్
ABN , First Publish Date - 2023-02-01T23:41:29+05:30 IST
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతాకుంభ్, 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.
108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
హజరు కానున్న ప్రముఖులు
శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 1: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతాకుంభ్, 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఇందుకు నిర్వాహికులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి ఉదయం 5:45గంటలకు సుప్రభాతం, 6 నుంచి 6:30 గంటల వరకు అష్టాక్షరీ మంత్రం, 6:30నుంచి 7గంటల వరకు ఆరాధాన, సేవాకాలం, అలాగే మధ్యాహ్నం వరకు పూర్ణహుతి, బలిహరణ పూజలుంటాయి. ఒంటిగంట నుంచి సాయంత్రం వరకు సాంస్కతిక కార్యక్రమాలుంటాయని నిర్వాహకులు తెలిపారు. అలాగే 5 నుంచి 5:45గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణం, 6 నుంచి రాత్రి 7:30గంటల వరకు సాకేత రామచంద్రస్వామి, 18 దివ్య దేశమూర్తుల 18 గరుడలపై యాగశాల ప్రవేశం, అనంతరం పూర్ణాహుతి ఉంటాయని వివరించారు.