నేటి నుంచి సమతా కుంభ్‌

ABN , First Publish Date - 2023-02-01T23:41:29+05:30 IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతాకుంభ్‌, 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి సమతా కుంభ్‌

108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం

హజరు కానున్న ప్రముఖులు

శంషాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 1: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతాకుంభ్‌, 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఇందుకు నిర్వాహికులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి ఉదయం 5:45గంటలకు సుప్రభాతం, 6 నుంచి 6:30 గంటల వరకు అష్టాక్షరీ మంత్రం, 6:30నుంచి 7గంటల వరకు ఆరాధాన, సేవాకాలం, అలాగే మధ్యాహ్నం వరకు పూర్ణహుతి, బలిహరణ పూజలుంటాయి. ఒంటిగంట నుంచి సాయంత్రం వరకు సాంస్కతిక కార్యక్రమాలుంటాయని నిర్వాహకులు తెలిపారు. అలాగే 5 నుంచి 5:45గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణం, 6 నుంచి రాత్రి 7:30గంటల వరకు సాకేత రామచంద్రస్వామి, 18 దివ్య దేశమూర్తుల 18 గరుడలపై యాగశాల ప్రవేశం, అనంతరం పూర్ణాహుతి ఉంటాయని వివరించారు.

Updated Date - 2023-02-01T23:41:30+05:30 IST