వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి
ABN , First Publish Date - 2023-01-26T00:05:02+05:30 IST
పసిపిల్లలకు, గర్భిణుకు టీకాలు క్రమం తప్పకుండా వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి స్వర్ణకుమారి తెలిపారు.
చేవెళ్ల, జనవరి 25 : పసిపిల్లలకు, గర్భిణుకు టీకాలు క్రమం తప్పకుండా వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి స్వర్ణకుమారి తెలిపారు. బుధవారం చేవెళ్లలోని ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. జిల్లాలో కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. గర్బిణీల నమోదు చేసి, రక్తహీనత, వారి దరిచేరకుండా వారిఇక న్యూట్రిషన్ గురించి తెలిసేలా చెప్పాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెద్యులు నిత్యం అందుబాటులో ఉండి ఆసుపత్రికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యసేవాలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పూల సంఖ్య పంచాలన్నారు. పిల్లలకు సకాలంలో టీకాలు ఇవ్వాలన్నారు. అంకితభావంతో పని చేసి వైద్యశాఖకు మంచి పేరు తీసుకరావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటి డిఎంహెచ్వో దామోదర్, సీహెచ్వో గోపాల్రెడ్డి, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.