అనాథలను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2023-02-06T23:58:49+05:30 IST

అనాథలను ఆదుకోవడానికి ప్రతీఒక్కరు ముందుకు రావాలని జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు.

అనాథలను ఆదుకోవాలి
నోట్‌పుస్తకాలు అందజేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌

మహేశ్వరం, ఫిబ్రవరి 6: అనాథలను ఆదుకోవడానికి ప్రతీఒక్కరు ముందుకు రావాలని జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాగారంలో సోమవారం అనాథ పిల్లలు ఉన్న మదర్సాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనాథలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఆర్ట్‌ ఫౌండేషన్‌ నుంచి రూ.20వేలతో పాటు పలు రకాల విద్యాసామగ్రిని అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా జడ్పీ నిధులతో చేపట్టిన సీసీరోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం పీఏసీఎస్‌ చైర్మన్‌ మంచె పాండుయాదవ్‌, ఉపసర్పంచ్‌ లతీఫ్‌, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:58:50+05:30 IST