శివయ్యకు ఘటాభిషేకం

ABN , First Publish Date - 2023-02-01T23:26:30+05:30 IST

మోమిన్‌పేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో శనైశ్చరస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం 108 కలశాలతో శివుడికి ఘటాభిషేకం నిర్వహించారు.

 శివయ్యకు ఘటాభిషేకం
మోమిన్‌పేట్‌: ఎన్కతల గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తున్న శివస్వాములు

108 కలశాలతో శివస్వాములు ఊరేగింపు

మోమిన్‌పేట్‌, ఫిబ్రవరి 1: మోమిన్‌పేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో శనైశ్చరస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం 108 కలశాలతో శివుడికి ఘటాభిషేకం నిర్వహించారు. శ్రీ భవానీ ఆలయం నుంచి శివస్వాములు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శ్రీనర్మదా మాత ఆలయంలో శివలింగానికి 108 కలశాలతో ఘటాభిషేకం నిర్వహించారు. ఆలయం శివనామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ పి.మహిపాల్‌రెడి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:26:31+05:30 IST