వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

ABN , First Publish Date - 2023-02-01T23:59:44+05:30 IST

మున్సిపాలిటీలోని 8వ వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆ వార్డు కౌన్సిలర్‌ వెంకన్నగౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజుగౌడ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కోరారు.

వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

తాండూరు, ఫిబ్రవరి 1 : మున్సిపాలిటీలోని 8వ వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆ వార్డు కౌన్సిలర్‌ వెంకన్నగౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజుగౌడ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కోరారు. బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను కలిసి వార్డులో నెలకొన్న సమస్యలు, ప్రజల ఇబ్బందులు తొలగించి అభివృద్ధికి పర్చాలని కోరారు. వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌ నాయకులు నర్సింహులు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, తదితరులున్నారు. అనంతరం కౌన్సిలర్‌, నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు.

Updated Date - 2023-02-01T23:59:45+05:30 IST