విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2023-02-01T23:28:11+05:30 IST

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన వికారాబాద్‌ మండల పరిధిలో చోటుచేసుకుంది. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన ఘనపురం రంగారెడ్డి(35) బుధవారం సాయంత్రం పొలానికి నీరు పెట్టడానికి వెళ్లాడు.

 విద్యుదాఘాతంతో రైతు మృతి

వికారాబాద్‌ మండలం పెండ్లిమడుగులో ఘటన

వికారాబాద్‌, ఫిబ్రవరి 1: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన వికారాబాద్‌ మండల పరిధిలో చోటుచేసుకుంది. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన ఘనపురం రంగారెడ్డి(35) బుధవారం సాయంత్రం పొలానికి నీరు పెట్టడానికి వెళ్లాడు. ఈక్రమంలో మోటారు ఆన్‌ చేసే సమయంలో కరెంటు వైరు తగలడంతోవిద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒక్కగానొక్క కొడుకు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధులుగా ఆదుకోవాలని సర్పంచ్‌ బుచ్చిరెడ్డి, గ్రామస్తులు కోరారు.

Updated Date - 2023-02-01T23:28:12+05:30 IST