ఈజీఎస్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆత్మహత్మ

ABN , First Publish Date - 2023-02-02T00:11:21+05:30 IST

మండల పరిషత్‌లోని ఈజీఎస్‌ సెక్షన్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ రచ్చ శ్రీనివాస్‌(30) ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈజీఎస్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆత్మహత్మ

ఆమనగల్లు, ఫిబ్రవరి1: మండల పరిషత్‌లోని ఈజీఎస్‌ సెక్షన్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ రచ్చ శ్రీనివాస్‌(30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లులోని సాయినగర్‌ కాలనీకి చెందిన శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని టీకేఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలో ఉంటూ రోజూ వచ్చి వెళ్తూ విధులు నిర్వర్తించేవాడు. బుధవారం విధులకు హాజరై బ్యాగ్‌ పెట్టి బయటకు వెళ్లాడు. ఆమనగల్లులోని సురసముద్రం చెరువులో మృతదేహం కన్పించగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయించి ఐడెంటిటీ కార్డు ఆధారంగా శ్రీనివా్‌సగా గుర్తించారు. అతడు రెండుమూడు రోజులుగా మనస్థాపంతో ఉన్నాడని, కడుపులో బుగులైతుందని శ్రీనివాస్‌ చెప్పాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శ్రీనివాస్‌ భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-02-02T00:11:34+05:30 IST