సీఎంఆర్‌ సెట్‌లో ‘బీ టూ బీ ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో’

ABN , First Publish Date - 2023-02-07T00:11:12+05:30 IST

కండ్లకోయ సీఎంఆర్‌ సెట్‌ కళాశాలలో సోమవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సామాజిక ఆవిష్కరణపై బీ టూ బీ ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో నిర్వహించారు.

సీఎంఆర్‌ సెట్‌లో ‘బీ టూ బీ ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో’

మేడ్చల్‌ టౌన్‌, ఫిబ్రవరి 6 : కండ్లకోయ సీఎంఆర్‌ సెట్‌ కళాశాలలో సోమవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సామాజిక ఆవిష్కరణపై బీ టూ బీ ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీఎంఆర్‌ గ్రూప్స్‌ కార్యదర్శి గోపాల్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల్లో దాగి ఉన్న సామాజిక ఆవిష్కరణ నైపుణ్యాన్ని వెలికి తీయాన్న ఉద్దేశ్యంతో కార్యక్రమం నిర్వహించామన్నారు. ద్వితీయ సంవత్సరం చదువుకునే విద్యార్థులు 109 జట్లుగా పాల్గొనగా.. వారిలో 54 జట్లను ఎంపిక చేసి పోటీ నిర్వహించామన్నారు. అందులో ప్రతిభ కన బర్చిన మూడు జట్లను ఎంపిక చేసి నగదు బహుమతులతో పాటు గుర్తింపు పత్తాలను అందించామని గోపాల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సీఈవో అభినవ్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ మేజర్‌ డా. వీఏ నారాయణ, హెచ్‌వోడీ బి. సురేష్‌ రామ్‌, విద్యార్థులు తదితరులు పాల్గొనారు.

Updated Date - 2023-02-07T00:11:13+05:30 IST