పేకాటరాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2023-02-07T00:08:15+05:30 IST
పేకాట శిబిరంపై మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి నగదను స్వాధీనం చేసుకొని ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో అప్పగించారు.
రూ. 24,770 నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం
ఘట్కేసర్ రూరల్, ఫిబ్రవరి 6 : పేకాట శిబిరంపై మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి నగదను స్వాధీనం చేసుకొని ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో అప్పగించారు. సీఐ అశోక్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పల్కు చెందిన ఐదుగురు ఎదులాబాద్ సమీపంలో ఉన్న ఓపెన్ ప్లాట్లో పేకాట ఆడుతుండగా సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు దాడిచేసి అరెస్టు చేశారు. 4 సెల్ఫోన్లు, రూ. 24,770 నగదు సాధీనం చేసుకున్నారు.