సమయ పాలన పాటించకుంటే చర్యలు

ABN , First Publish Date - 2023-02-01T23:47:49+05:30 IST

సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని జిల్లా పరిషత్‌ సీఈవో దిలీ్‌పకుమార్‌ హెచ్చరించారు.

సమయ పాలన పాటించకుంటే చర్యలు
రికార్డులను పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 1: సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని జిల్లా పరిషత్‌ సీఈవో దిలీ్‌పకుమార్‌ హెచ్చరించారు. బుధవారం ఆయన ఇబ్రహీంపట్నం మండల పరిషత్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటలకే కార్యాలయానికి వచ్చిన జడ్పీ సీఈవో.. ఎంపీడీవో జయరాం విజయ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రామకృష్ణారావు జూనియర్‌ అసిస్టెంట్‌ సత్యనారాయణలు ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారికి చార్జి మెమో జారీ చేస్తున్నట్ల్లు ఆయన చెప్పారు. అనంతరం అకౌంట్‌ బుక్‌, రికార్డులను పరిశీలించారు.

Updated Date - 2023-02-01T23:47:50+05:30 IST