ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య : రవీంద్ర
ABN , First Publish Date - 2023-01-26T01:03:41+05:30 IST
తెలంగాణ ప్ర భు త్వం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభు త్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తుందని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్ అ న్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య : రవీంద్ర
దేవరకొండ, జనవరి 25: తెలంగాణ ప్ర భు త్వం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభు త్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తుందని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్ అ న్నారు. బుధవారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు, మనబడి కార్యక్రమంలో భాగంగా మంజూరైన రూ.14లక్షలతో అదనపు తరగతి గదులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. మన ఊరు, మనబడి పథకంలో ప్రభుత్వ పాఠశాలలు, అదనపు గదులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో దేవరకొండ ఎంపీపీ జానయాదవ్, జడ్పీటీసీ మారేపాకల అరుణ సురే్షగౌ డ్, ప్రవీణ్రెడ్డి, సుభాష్, కృష్ణయ్య, ఎంపీడీవో శర్మ, సర్పంచ విద్యావతి వెంకట్రెడ్డి, ఏఈ శంకర్, శ్రీనునాయక్, తిరుపతయ్య, కల్యాణ్, చంద్రయ్య పాల్గొన్నారు.